సాహిత్యం

Saturday, November 24, 2018

నీతి కథ

: ధర్మాచారం :                                                        ధర్మానికి   " పుణ్యము, నీతి" అని అర్థాలు. ధర్మానికి అనుగుణమైన ఆచరణను కలిగి ఉండటమే ధర్మాచారం.  సకల నీతి కథా నిదానంలో-   మణికర్ణిక తన భర్తతో మంచంపై వున్న సమయంలో చీమల గుంపు మంచంవైపుకు వచ్చి ఆగుతుంది. మంచం కోడు అడ్డం వచ్చిందని చీమలు తమ రాజుకు చెప్తాయి. చీమల రాజు అడ్డం వచ్చిన దాన్ని ఎత్తివేయమంటాడు. జంతుభాష తెలిసిన భర్త చీమల భాష విని పెద్దగా నవ్వుతాడు. నవ్విన కారణం చెప్పమని మణిరేఖ బలవంత పెడుతుంది. చెపితే తన చావుకు వస్తుందని భర్త చెప్పినా వినని మణిరేఖ చెప్పక పోతే తానే చనిపోతానంటుంది. ఆమెకు కారణం చెప్పదలచిన భర్త శ్మశానంలో చితిని పేర్పించుకుంటాడు. భార్య కు చెప్పి ప్రాణాలు విడవాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఒక చింబోతుతో మేక నూతిలోని గడ్డి తెమ్మంటుంది. ఆ చింబోతు నూతిలోకి పోతే చస్తాను. 'నా ప్రాణాలు పోయే పని చెప్పిన నీవు నాకెందుకు' అని పలికి మేకను విడిచి పెడుతుంది. చింబోతు మాటలు విన్న రాజుకు జ్ఞానోదయమవుతుంది. తాను చితిని పేర్చుకున్నా మనసు మార్చుకోని మణిరేఖను వదిలించుకొని, పతిభక్తి గల మరొక స్త్రీని పెండ్లాడి సుఖంగా వుంటాడు.